Sunday, April 28, 2024

Breaking : పాక్​ డ్రోన్​ కూల్చివేత : నలుగురు అరెస్ట్​

స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం (బీఎస్ఎఫ్‌) ఓ పాకిస్థాన్ డ్రోన్ ను కూల్చివేసింది. పంజాబ్​ ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్​ డ్రోన్​ను కూల్చివేసింది. అందులో 4కేజీల నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో డ్రోన్​ శబ్దానికి అప్రమత్తమై.. దానిని గురిపెట్టేందుకు పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేసినట్లు బీఎస్​ఎఫ్​ అధికార ప్రతినిధి తెలిపారు. డ్రోన్​కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు ప్యాకెట్​ ఉన్నాయని వెల్లడించారు. అలాగే జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement