Thursday, May 2, 2024

మ‌రోసారి రామ్ చర‌ణ్ కి విల‌న్ గా ‘అర‌వింద్ స్వామి’

ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్నాడు. కాగా ఆచార్య చిత్రం కూడా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. ‘ఆచార్య’ ప్రమోషన్స్ మొదలయ్యేవరకూ ఆయన శంకర్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. శంకర్ సినిమాను అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అవినీతి రాజజీయ నాయకుడే ప్రతినాయకుడు. ఈ పాత్రను శంకర్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట. అందువలన ఈ పాత్ర కోసం ఎస్.జె. సూర్యను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. గతంలో చరణ్ హీరోగా చేసిన ‘ధ్రువ’ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా మెప్పించాడు. అందువలన ఆయన అయితే బాగుంటాడని చరణ్ చెప్పడంతో, ఆయనను శంకర్ రంగంలోకి దింపుతున్నాడని స‌మాచారం.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement