Tuesday, May 14, 2024

పాకిస్థానీ షిప్ నుండి – 50కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు

గుజ‌రాత్ ఏటీఎస్..ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ భారీ విజ‌య‌వంత‌మ‌యింది. అక్టోబర్ 8న గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌ కలిసి ఓ ఆపరేషన్ చేశాయి. నిఘా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అరేబియా సముద్రంలో పాకిస్థానీ షిప్ ను అడ్డగించాయి. ఆ ప‌డ‌వ నుంచి 50 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.350 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది. పడవను జఖౌ (కచ్)కి తీసుకువస్తున్నారు.
విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు పాకిస్థాన్ కు చెందిన షిప్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) అధికారులు తనిఖీ చేశారు. వారికి 350 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌తో పాకిస్తాన్ చెందిన ఆరుగురు స్మ‌గ్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంవత్సరంలో గుజారాత్ ఏటీఎస్ తో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన ఆరో ఆపరేషన్ ఇది. అదే సమయంలో గత నెల రోజుల్లో ఇది రెండో విజయం. అంతకుముందు సెప్టెంబర్ 14న పాకిస్థాన్ బోటులో సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ పట్టుబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement