Thursday, May 9, 2024

Spl Story | నేను చావలేదు, కాపాడండి.. శవాల గది నుంచి మూలుగులు!

అదో విషాద ఘటన.. ఎవరూ ఊహించని పరిణామం.. ఆ రైలు జర్నీ చేస్తున్నవారిలో కొంతమంది జాలీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొతమంది నిద్రలోకి జారుకునే పనిలో ఉన్నారు. అంతలోనే భారీ శబ్దాలతో కుదుపులు.. ఏమైతుందో తెలుసుకునే లోపే ఒకరిమీద ఒకరు విసిరేసినట్టు పడిపోయారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోగా, ఇంకొంతమందికి కాళ్లు, చేతులు విరిగి బతికి బయటపడ్డారు. అయితే.. చనిపోయాడనుకుని పట్టాలపై పడిపోయిన ఓ వ్యక్తిని మూటగట్టి మృతదేహాలతో పాటు తరలించారు రెస్క్యూ టీమ్​ మెంబర్లు. తీరా శవాలను భద్రపరిచిన గదిలో ఒక్కొక్క డెడ్​బాడీని క్లియర్​  చేస్తుంటే రెస్క్యూ టీమ్​ మెంబర్​కి ఓ మూలుగు లాంటి శద్దం వినిపించింది. ‘‘నేను చావలేదు, నన్ను కాపాడండి”అనే మాటలు విని ఆ వ్యక్తి షాక్​కు గురయ్యాడు. తన కాళ్లను పట్టుకుని నాకు కొన్ని నీళ్లు ఇవ్వండి దాహంగా ఉందని చెప్పడంతో ఆలోచనలోపడ్డాడు. వెంటనే తేరుకుని ఇతర టీమ్​ మెంబర్స్​ని పిలిచి అతడిని ఆస్పత్రికి తరలించారు. అవును.. అందరూ చనిపోయాడు అనుకున్న 35 ఏండ్ల రాబిన్​ నయ్యా రెండు కాళ్లు కోల్పోయి ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఒడిశాలోని బాలాసోర్​లో మూడు రైళ్ల ప్రమాదం విషాదాన్ని దేశం ఇంకా మరిచిపోలేదు. అయితే.. ఇక్కడో గుడ్​ న్యూస్​ చెప్పుకోవాలి. అంతా చనిపోయాడు అనుకుని శవాల కుప్పలో పడేసిన ఓ వ్యక్తి బతికి బయటపడ్డాడు. శుక్రవారం రాత్రి మూడు రైళ్ల ప్రమాదం జరిగిన తర్వాత.. చాలామంది పట్టాలపై విసిరేసినట్టు పడిపోయాడు. ఇందులో రాబిన్ నయ్య అనే వ్యక్తి చనిపోయాడని అంతా భావించారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో రైలు ప్రమాద స్థలానికి సమీపంలోని ఒడిశాలోని బాలాసోర్‌లోని ఓ పాఠశాల గదిలో వందలాది మృతదేహాలతో పాటు అతడిని కూడా తీసుకెళ్లి ఉంచారు.

- Advertisement -

35 ఏళ్ల అతను క్లాస్ట్రోఫోబిక్ పాఠశాల గదిలో డజన్ల కొద్దీ శరీరాల మధ్య వేదన కలిగించే క్షణాల నుంచి తప్పించుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది పాఠశాల గదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న మృతదేహాలను ఒక్కొక్కటిగా తొలగిస్తుండగా.. నయ్య నుంచి మూలుగులాంటి శబ్దం వినిపించింది. రెస్క్యూ ఆపరేషన్​లో ఉన్న వారిలో ఒకరు మృతదేహాల మధ్య నడుస్తున్నప్పుడు ఒక చేయి అకస్మాత్తుగా అతని కాలును పట్టుకున్నట్లు అనిపించింది. ఆపై అతను వాటర్​ కావాలనే మూలుగులాంటి పదాలు విన్నాడు. ‘‘నేను బతికే ఉన్నాను, చనిపోలేదు, దయచేసి నాకు నీళ్లు ఇవ్వండి”అనే మాట వినడంతో ఒక్కసారిగా ఒళ్లు జలదరించినట్టయ్యింది. అంతే వేగంగా అతని మెదడు పనిచేసి వెంటనే ఇతర సహాయకులను పిలిచి ఆస్పత్రికి తరలించారు.

తొలుత ఆ మూలుగు వినిపించిన మూటలోని 35 ఏళ్ల రాబిన్‌ నయ్యాని చూడటానికి ధైర్యం చాలలేదు. అతను సజీవంగా ఉన్నాడు. కానీ, కదలడానికి కష్టపడుతున్నాడు.. రక్షించమని వేడుకున్నాడు. రెస్క్యూ టీమ్​ మెంబర్స్​ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌లోని చర్నేఖలి గ్రామానికి చెందిన రాబిన్ నయ్య ఈ ప్రమాదంలో కాళ్లు కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడిశా రైలు దుర్ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో వారి సంఖ్య 278కి చేరినట్టు రైల్వే అప్‌డేట్ చేసింది.

రాబిన్ నయ్య తన గ్రామానికి చెందిన మరో ఏడుగురితో కలిసి పని వెతుక్కుంటూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో హౌరా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నాడు. రెండు దశాబ్దాలలో అత్యంత దారుణమైన రైలు ఢీకొనడంతో రెండు కాళ్లను కోల్పోయాడు. ప్రస్తుతం, పరిస్థితి విషమంగా ఉంది. రాబిన్ నయ్య మేదినీపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

తన మేనల్లుడు రాబిన్ వలస కూలీగా పని చేయడానికి ఆంధ్రాకు వెళ్తున్నాడని, రైలు ప్రమాదానికి గురికావడంతో స్పృహ కోల్పోయినట్టు మామ మనబేంద్ర సర్దార్​ చెప్పాడు. అతను మృతదేహాల కుప్ప మధ్య పడిఉన్నట్టు తెలిసింది. అని నయ్య మామ మనబేంద్ర సర్దార్ చెప్పాడు. రాబిన్ నయ్య ఆరుగురు స్నేహితుల ఆచూకీ ఇంకా తెలియలేదు. కాగా, రైలు ప్రమాదంలో నయ్య కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి కాదు. 2010లో పశ్చిమ మిడ్నాపూర్‌లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 148 మంది మృతి చెందినప్పుడు నయ్య కుటుంబానికి చెందిన మరో వ్యక్తి ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడని అతని మేనమామ చెప్పాడు.

రాబిన్ నయ్య మామ మనబేంద్ర సర్దార్, తన అన్న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నారని, అది ఎదురుగా వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పిందని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు కూడా ఇట్లనే రెస్క్యూ టీమ్​ చనిపోయాడు అనుకుని భావించిన తర్వాత నా సోదరుడు బతికి బయటపడ్డాడని, అప్పటి విషయాన్ని యాది చేసుకున్నాడు.

జూన్ 2న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో 278 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. విషాదం తరువాత బాధితుల బంధువులు తమవారి కోసం వెతుకులాడుతున్నారు. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని, 200 మంది ప్రస్తుతం ఒడిశాలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రైల్వే డివిజనల్ మేనేజర్ (తూర్పు-మధ్య డివిజన్) రింకేశ్ రాయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement