Monday, May 6, 2024

నువ‌నిదు ఫెర్నాండో అరుదైన ఘ‌న‌త‌.. తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీ

అరుదైన ఘ‌న‌త‌ని సాధించాడు శ్రీ‌లంక ఓపెన‌ర్ నువ‌నిదు ఫెర్నాండో . భార‌త్‌తో జ‌రుగుతున్న‌ రెండో వ‌న్డేలో ఆరంగ్రేటం చేసిన అత‌ను తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. దాంతో ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనే అర్థ శ‌త‌కం చేసిన ఆరో శ్రీ‌లంక ఆట‌గాడిగా ఈ ఓపెన‌ర్‌ గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన అవ‌కాశాన్ని నువ‌నిదు ఫెర్నాండో అందిపుచ్చుకున్నాడు. ఒక‌వైపు వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్నా హాఫ్ సెంచ‌రీ సాధించి జ‌ట్టును ఆదుకున్నాడు. 63 బంతుల్లో6 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో సింగిల్‌కు ప్ర‌య‌త్నించి ర‌నౌట్ అయ్యాడు. శుభ్‌మ‌న్ గిల్ మెరుపు వేగంతో విసిరిన బంతిని అందుకున్న కేఎల్ రాహుల్ వికెట్ల‌ను గిరాటేశాడు. దాంతో అత‌ని ఇన్నింగ్స్ ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement