Sunday, April 28, 2024

ఏ మ‌హిళ ‘హిజాబ్’ ని ఇష్ట‌ ప్ర‌కారం ధ‌రించ‌రు – సీఎం యోగి ఆదిత్య‌నాథ్

త‌న అధికారుల‌కు డ్రెస్ కోడ్ అమ‌లు చేయ‌న‌ని తెలిపారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్. త‌న‌కు కాషాయ వ‌స్త్రాలు ధ‌రించ‌డ‌మే ఇష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రతీ వ్యక్తి తాను కోరుకున్నది ధరించొచ్చు. ఆ స్వేచ్ఛ బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, ఇళ్లకే పరిమితం. కానీ, ఎవరిపైనా డ్రెస్ కోడు రుద్దబోం. ప్రతీ సంస్థ యూనిఫామ్ నిబంధనను అనుసరించాలి. ఒకవేళ పోలీసుమ్యాన్ తాను ఒక మతానికి చెందిన వ్యక్తినని, ఆ మత సంప్రదాలకు తగ్గ వస్త్రాలు ధరిస్తానంటే గందరగోళానికి దారితీస్తుంద‌న్నారు. ముస్లిం మహిళలపై హిజాబ్ బలవంతంగా రుద్దిన ఆచారమే కానీ, వారు తమ ఇష్టానుసారం ధరిస్తున్నది కాదని ఆదిత్యనాథ్ అన్నారు. ‘‘ఏ మహిళ కూడా హిజాబ్ ను తన ఇష్ట ప్రకారం ధరించదు. ట్రిపుల్ తలాఖ్ అనే దుష్ట సంప్రదాయాన్ని మహిళలు ఎప్పుడైనా ఆమోదించారా..కూతుర్లు, సోదరీమణులను ప్రశ్నించండి. దీని గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో నేను వారి కళ్లలో నీళ్లు చూశాన‌ని సీఎం వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement