Sunday, April 28, 2024

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు.. మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 697 పాయింట్లు లాభపడి 57,989కి పెరిగింది. నిఫ్టీ 198 పాయింట్లు పుంజుకుని 17,315 వద్ద స్థిరపడింది. 

టెక్ మహీంద్రా, రిలయన్స్ , బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, టీసీఎస్ కంపెనీలు టాప్ గెయినర్స్ గా నిలువగా.. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా కంపెనీలు నష్టాలు చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement