Friday, May 10, 2024

ఐదు వంద‌ల మంది పౌరులు మృతి – వెయ్యికి పైగా బిల్డింగ్ లు ధ్వంసం

ర‌ష్యా జ‌రిపిన దాడుల్లో వెయ్యికి పైగా బిల్డింగ్ లు ధ్వంస‌మైన‌ట్లు ఉక్రెయిన్ తెలిపింది. ధ్వంస‌మైన వాటిలో ఎక్కువ శాతం రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్‌లు ఉన్న‌ట్లు చెప్పింది. ఈ సిటీపై ప్ర‌తి రోజూ దాడులు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 500 మంది పౌరులు మృతిచెందిన‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించింది. ర‌ష్యా-ఇజ్రాయిల్ బిలియ‌నీర్ రోమ‌న్ అబ్ర‌మోవిచ్‌కు చెందిన రెండు నౌక‌ల‌ను ట‌ర్కీలో సీజ్ చేశారు. సంప‌న్న ర‌ష్య‌న్ల‌పై యురోపియ‌న్ దేశాలు ఆర్థిక‌ ఆంక్ష‌ల‌ను విధిస్తున్నాయి. 160 మీట‌ర్ల పొడువైన ఎక్లిప్స్ బోటును మార్‌మారిస్ పోర్టు వ‌ద్ద నిలిపేశారు. ఇప్ప‌టికే బోడ్ర‌మ్‌లో 140 మీట‌ర్ల పొడువైన సూప‌ర్ బోట్ సోలారిస్‌ను సీజ్ చేశారు 35 ల‌క్ష‌ల మంది ఉక్రెయిన్‌ను వ‌దిలి వ‌ల‌స వెళ్లిన‌ట్లు యూఎన్ అంచ‌నా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement