Thursday, May 9, 2024

ఓటు హ‌క్కు వినియోగించుకున్న కొత్త దంప‌తులు

పెళ్ల‌యిన కొత్త జంట త‌మ ఓటుని వినియోగించుకున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హనుమాన్‌గఢ్ లక్ష్మీ కాన్వెంట్ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో కొత్తగా పెళ్లయిన జంట త‌మ ఓటుని వినియోగించుకున్నారు. ఫరూఖాబాద్ సదర్ అసెంబ్లీలోని బూత్ నంబర్ 181 (నారాయణ్ ఆర్య కన్యా పాఠశాల) వద్ద, ఈవీఎం యంత్రం పాడైంది. ఇక్కడ గంటపాటు ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఎటా జిల్లాలోని అలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం 103, బూత్ నంబర్ 104, 151 వద్ద ఈవీఎంలు పని చేయకపోవడంతో ఓటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. జలౌన్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం 190వ నంబర్ బూత్‌లోని కల్పి-220 వద్ద ఉన్న ఈవీఎం కూడా పాడ‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement