Friday, April 26, 2024

Breaking: డ్ర‌గ్స్ కేసులో కొత్త కోణం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ హైటెక్ టెక్నాల‌జీ వినియోగం

హైద‌రాబాద్‌లో ఆదివారం తెల్ల‌వారు జాము దాకా సాగిన రాడిస‌న్ ప‌బ్‌, ఫుండింగ్‌ అండ్ మింక్ ప‌బ్ వ్య‌వ‌హారంలో కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. నిర్వాహ‌కులు ఈ ప‌బ్ నిర్వాహ‌ణ‌కు, డ్ర‌గ్స్ స‌ప్ల‌య్ కోసం హైటెక్ ప‌ద్ధ‌తుల‌ను అవలంబించిన‌ట్టు తెలుస్తోంది. పామ్ యాప్ ద్వారా యాక్సెస్ ఉన్న‌వారికి మాత్ర‌మే ప‌బ్‌లోకి ఎంట్రీ ఉన్న‌ట్టు పోలీసుల ప‌రిశీలన‌లో వెల్ల‌డైంది. దీని కోసం ఒక్కొక్క‌రి నుంచి ల‌క్ష రూపాయ‌ల‌కు పైగానే చార్జి చేస్తార‌ని తెలుస్తోంది. డ్ర‌గ్స్ దందా న‌డిపించేందుకు ఈ హైటెక్ ప‌ద్ధ‌తుల‌ను నిర్వాహ‌కులు ఉప‌యోగించిన‌ట్టు పోలీసులు క‌నుగొన్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రెవ‌రు డ్ర‌గ్స్ తీసుకుని ఉంటార‌నే కోణంలో ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement