Saturday, May 4, 2024

తెలంగాణలో కొత్తగా ఏరోడ్రోమ్‌లు.. ఆర్థిక వృద్ధిలో విమానయాన రంగం కీలకం: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో కొత్తగా ఏరోడ్రోమ్‌లుు, హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దేశంలో ప్రస్తుతం 140 ఉన్న విమానాశ్రయాల సంఖ్యను 2025 నాటికి 220కి పెంచుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో కొనసాగుతున్న వింగ్స్‌ ఇండియా ఏవియేషన్‌ సదస్సుకు సింధియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి.. ఆర్థిక వృద్ధికి ఎంతో కీలకమని సింధియా అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత వేగంగా కోలుకుని అనేక మందికి పౌరవిమానయాన రంగం ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం విమాన ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగా ఉందని, త్వరలో కొవిడ్‌ ముందున్న పరిస్థితికి భారత్‌ చేరుకుంటుందన్నారు. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాలతో ఏవియేషన్‌ రంగం మరింత వేగంపుంజుకోనుందని పేర్కొన్నారు. దేశంలో గత ఏడేళ్లలో భారీగా విమానాశ్రయాల సంఖ్య పెరిగిందన్నారు. ఏడేళ్లలో దేశంలో కొత్తగా 66 ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మహిళలను ఏవియేషన్‌ వైపు ప్రోత్సహించాలి: గవర్నర్‌ తమిళిసై..

మహిళలను ఏవియేషన్‌ వైపు ప్రోత్సహించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశీయ వ్యాక్సిన్‌ తీసుకున్నందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఏవియేషన్‌ ద్వారా విదేశాలకు మన వ్యాక్సిన్లు చేరుతున్నాయని తెలిపారు. టీకాలు, ఔషధాలు, మందుల పిచికారీలకు డ్రోన్‌ పాలసీ దోహదం చేస్తోందని వివరించారు. డ్రోన్ల ద్వారా గిరిజన ప్రాంతాల వారికి మేలు జరుగుతోందని పేర్కొన్నారు.

ఏరోస్పేస్‌ హబ్‌గా తెలంగాణ: మంత్రి వేముల..

వింగ్స్‌ ఇండియా-2022 ఏవియేషన్‌ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్‌ నగరానికి గర్వకారణమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఏరోస్పేస్‌ హబ్‌గా తెలంగాణ అవతరించిందన్నారు. ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని తెలిపారు. ్లఫయింగ్‌ ఫర్‌ ఆల్‌ విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పాత విమానాశ్రయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. ”గ్రీన్‌ఫీల్డ్‌, బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వాటర్‌ ఎయిరో డ్రోమ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. అన్ని జిల్లాల్లో హెలీప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్‌ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం తన విజన్‌ను చాటిందన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement