Thursday, April 25, 2024

మెడికల్‌ కాలేజీలపై కేంద్రానిది గోబెల్స్‌ ప్రచారం: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై పదే పదే పచ్చి అబద్ధాలు చెబుతోందని కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా గోబెల్స్‌ ప్రచారానికి దిగిందని మండిపడ్డారు. మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. ఈరోజు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపైనా లోక్‌సభ వేదికగా దుష్ప్రచారం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ విషయమై శుక్రవారం తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

మెడికల్‌ కాలేజీల మంజూరు కోరుతూ తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌ పార్లమెంట్‌లో చెప్పటం బాధ కలిగించిందన్నారు. మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర మంత్రులు పార్లమెంట్‌ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని మండిపడ్డారు. కేంద్రం స#హకరించకపోయినా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ దిశగా వేగంగా అడుగులు వేసున్నామని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement