Wednesday, May 15, 2024

నీతా అంబానీ క‌ళ్లు ఎంత బాగున్నాయో – ప్రీతిజింటా ట్వీట్

ముంబై ఇండియ‌న్స్ య‌జ‌మాని నీతా అంబానీ క‌ళ్లు ఎంత బాగున్నాయో ..ఒప్పుకొని తీరాల్సిందేనని ట్వీట్ చేసింది న‌టి , పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని ప్రీతి జింటా.ఐపీఎల్ మెగా వేలం స‌మ‌యంలో ఏ జ‌ట్టు యాజ‌మాన్యం మాస్క్ లు ధ‌రించ‌లేదు. ఒక్క‌రో, ఇద్ద‌రో త‌ప్ప ఎవ‌రూ మాస్క్ లు పెట్టుకోలేదు. అయితే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స‌భ్యులు మాత్ర‌మే మాస్క్ లు పెట్టుకుని వేలంలో పాల్గొన్నారు. వారిపై ప్ర‌శంస‌లు కురిపించారు ప్రీతి జింటా. ఇదే విషయాన్ని ఫొటో పెట్టి మరీ ప్రీతి జింటా మెచ్చుకుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కరోనా నిబంధనలను పాటిస్తూ వేలంలో పాల్గొనడం చూస్తుంటే ఆనందంగా ఉందని కొనియాడింది. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ కళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement