Saturday, May 4, 2024

సాంస్కృతిక మ‌హోత్స‌వాల్లో నేడు నాగార్జున‌.. రేపు చిరంజీవి : కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మ‌హోత్స‌వాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు క్రాఫ్ట్స్ మేళాను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర రాజ‌న్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ… నేటి కార్య‌క్ర‌మంలో సినీన‌టుడు నాగార్జున పాల్గొంటార‌ని, రేపు జ‌రిగే ఉగాది కార్య‌క్ర‌మంలో చిరంజీవి పాల్గొంటార‌ని కిష‌న్ రెడ్డి వివ‌రించారు. అలాగే సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఈ రోజు సాయంత్రం ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ప్రారంభిస్తార‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement