Thursday, April 25, 2024

Revanth reddy: ‘కేసీఆర్ కిట్’ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపండి!

వరంగల్ ఎంజీఎంలో రోగిపై ఎలుకలు దాడి చేసిన ఘ‌ట‌న‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘ఆరోగ్య మంత్రి హరీశ్‌ గారూ.. “కేసీఆర్ కిట్టీ”లో మీతో పాటు కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. “కేసీఆర్ కిట్” అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించండి. పేదల పట్ల మానవత్వం ప్రదర్శించండి’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

వరంగల్ ఎంజీఎంలో రోగిపై ఎలుకలు దాడి చేసిన క‌ల‌క‌లం రేపింది. ఐసీయూలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతులను ఎలుకలు కొరికేయ‌డంతో ఆయ‌న‌కు తీవ్ర రక్తస్రావం అయింది. ఆసుప‌త్రిలో ఎలుక‌లు తిరుగుతున్న‌ప్ప‌టికీ సిబ్బంది ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఘటన సంచలనం కావడంతో దీనిపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement