Thursday, May 2, 2024

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పూర్తయిన సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కరోనా బారినపడినట్టు సమాచారం. అటు అధికార పార్టీ ముఖ్య నేతలకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే క్రమంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. ఇప్పటి వరకు సాగర్ నియోజకవర్గంలోని పెద్దపూరలో 59, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమనూర్‌లో 7, సాగర్‌లో 17 కేసులు నమోదు అయ్యాయి. సాగర్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 160 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. పోలింగ్ కారణంగా కరోనా కేసులు పెరిగినట్టు అధికారులు చెప్పడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement