Thursday, April 18, 2024

పేద విద్యార్థినికి ఆర్థిక సాయం

ప్రొద్దుటూరు కల్చరల్, : పట్టణంలోని డి సి ఎస్ ఆర్ కాలనీ లో నివాసముంటూ స్థానిక వరద రాజా పీజీ కళాశాలలో పిజీ ఎం ఎస్ సి మ్యాథమెటిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న యలమర్తి జానకి చదువుకు ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు ఆర్థిక సాయం అందించారు. విద్యార్థిని ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు రెండు సంవత్సరాలకు సంబంధించిన కళాశాల ఫీజును తామే చెల్లిస్తామని తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ కు ఒక సంవత్సరం ఫీజు 16 వేల రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు జాన్ పాల్, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement