Wednesday, May 8, 2024

TS | నా ఫోన్ పోయింది సార్​.. పోలీసుల‌కు బండి ఫిర్యాదు

త‌న ఫోన్ పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప‌దో తరగతి పేపర్ లీకేజ్ కేసులో ఈ నెల 4వ తేదీన అర్ధ‌రాత్రి పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసి, బొమ్మల రామారం పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలోనే తన ఫోన్ పోయిందని ఆ ఫిర్యాదులో బండి పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా తనతో ఉన్న పోలీసులకు కూడా ఫోన్ పోయిన విషయం తెలుసని, అప్పుడే సమాచారం ఇచ్చినట్లు బండి సంజయ్ ఫిర్యాదులో రాశారు. అయితే.. పోలీసులు మాత్రం సంజయ్ తమకు ఫోన్ ఇవ్వట్లేదని, విచారణకు సహకరించట్లేదని కోర్టుకు వెల్లడించారు. దీనికి స్పందించిన సంజయ్ తన ఫోన్ పోలీసులే లాక్కున్నారని కోర్టుకు తెలిపినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement