Saturday, April 27, 2024

Munugode bypoll: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు..

మునుగోడు ఉప ఎన్నికలను ఇటు టీఆర్‌ఎస్‌, అటు బీజేపీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మునుగోడులో తమ జెండా ఎగురవేసి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ఆయా పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ వేడి సృష్టిస్తున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై ప్రలోభాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా మునుగోడు వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తాజాగా లక్కలపల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కాన్వాయ్‌ని ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి ప్రయాణిస్తున్న కారులో బ్యాగులతో పాటు అణువణువూ శోధించారు. కాన్వాయ్‌లోని అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ చేస్తున్న పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సహకారం అందించారు. కాన్వాయ్‌ ను చెక్‌ చేసిన అనంతరం మంత్రి వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement