Tuesday, May 7, 2024

రామ్ గోపాల్ వర్మ వ్యూహం..వెనుక సీఎం జగన్ వున్నారా

బుధవారం ఏపీ సీఎం జగన్ ని కలిశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కాగా నేడు ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించడం విశేషం. బయోపిక్ లని తనదైనశైలిలో తెరకెక్కిస్తూ వివాదాలను సృష్టిస్తారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..కాగా తాజాగా వ్యూహం అనే రాజకీయ సినిమాని తెరకెక్కించనున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని ట్వీట్ చేశారు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉంటాయేమో కానీ, రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయని వెల్లడించారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే ‘వ్యూహం’ కథ అని రామ్ గోపాల్ వర్మ వివరించారు.ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ‘వ్యూహం’ చిత్రం ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement