Sunday, May 19, 2024

మోడీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కే ఉంది : మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

చౌటుప్పల్‌: ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. 18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌ రెడ్డిలాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు అని, మా ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు అన్నారు. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్‌ తెలంగాణ సమాజంలో శెభాస్‌ అనిపించుకున్నారన్నారు. కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీన్ని తట్టు-కోలేక ఈ కుట్రకు పూనుకున్నారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కొని ఇక్కడ ఏమో జరుగుతుందని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు- కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నందుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల దోసినట్టు- తెలంగాణలో చేస్తామంటే… బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు అని మండిపడ్డారు. ఇది కేసీఆర్‌ అడ్డా అంటూ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement