Friday, May 3, 2024

మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు.. జాతీయ గీతాన్ని అవమానించారని కేసు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబయి కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 1 న ముంబయి సిటీకి  వచ్చినప్పుడు జాతీయ గీతాన్ని అవమానించారనే ఆరోపణలపై దాఖలైన కేసులో మార్చి 2న తమ ముందు హాజరు కావాలని ముంబైలోని మజ్‌గావ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. బీజేకీ కార్యకర్త, న్యాయవాది వివేకానంద్ గుప్తా జాతీయ గీతాన్ని ఆరోపించారని మమతపై ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టును గుప్తా కోరారు.

గత సంవత్సరం రచయిత-కవి జావేద్ అక్తర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ప్రధాన వక్తగా పాల్గొన్న మమతా బెనర్జీ “జాతీయ గీతం ప్రారంభమైనప్పుడు కూర్చొని ఉన్నారు. తర్వాత ఆమె లేచి, రెండు పద్యాలు పాడి ఆకస్మికంగా పాడటం మానేశారని ఆ ఫిర్యాదులో వివేకానంద్​ గుప్తా పేర్కొన్నారు. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిందని గుప్తా పేర్కొన్నారు. నిందితురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆమె తన అధికారిక విధులను నిర్వర్తించలేదని  కోర్టుకు వాదనలు వినిపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement