Wednesday, May 15, 2024

మెట్లపై నుంచి జారిప‌డ్డ ఎంపీ శ‌శిథ‌రూర్.. కాలికి గాయం..

కాంగ్రెస్ సీనియర్ నేత‌, ఎంపీ శశి థరూర్ కాలికి గాయ‌మైంది. ఆయ‌న‌ పార్లమెంటులో మెట్లు దిగుతూ కింద‌ప‌డ్డారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన థరూర్… మెట్లు దిగే క్రమంలో జారిపడ్డారు. ఎడమ కాలు బెణకడంతో ఓ దశలో నడవడానికి ఇబ్బంది పడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లారు. కాలుకు బ్యాండేజ్ వేయించుకున్న థరూర్ తన నివాసానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉన్నానని, నియోజకవర్గంలో కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ట్వీట్ చేశారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement