Saturday, May 4, 2024

ఇందూర్ పాలిటిక్స్: మంత్రికి బీజేపీ ఎంపీ వార్నింగ్

హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తే నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీనేనని  బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరులో ఎంపీ పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన మలావత్ సిద్ధార్థ్ కుటుంబాన్ని పరామర్శించి, బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్ధార్థ్ బీజేపీ కార్యకర్త అని పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడనే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ హత్య చేయించాడని ఆరోపించారు. సిద్ధార్థ్ తండ్రి మంచాన పడితే సీఎం రిలీఫ్ ఫండ్ రాకుండా మంత్రి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య కేసులో నిందితుడికి పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. బాల్కొండలో టిఆర్ఎస్ నేతలే గంజాయి దందా చేస్తున్నారని, గంజాయి స్మగ్లింగ్ చేసేవారిని మంత్రి కాపాడుతున్నారని ఎంపీ ఆరోపించారు. నిందితులు లాకప్ లో ఉండగా సెల్ ఫోన్ ఇచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: బ్లాక్ దందా: ఆనందయ్య మందు రూ.20 వేలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement