Thursday, April 25, 2024

గ‌ర్భిణీకి క‌రోనా… బిడ్డ‌కు జ‌న్మనిచ్చి మృతి

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లం క‌ట్రియాల‌లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పాముల మౌనిక‌(21)కు క‌రోనా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. పెద్ద‌గా ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌టంతో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇంట్లోనే వైద్య స‌హాయం పొందుతోంది. అయితే నిండు గ‌ర్భిణి అయిన మౌనిక‌కు పురిటి నొప్పులు రావ‌టంతో వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లించారు. దీంతో ఆప‌రేష‌న్ చేయాల్సి వ‌చ్చింది. ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మౌనిక‌కు ఒక్క‌సారిగా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోయాయి. దీంతో మౌనిక ప్రాణాలు కోల్పోయింది. కాగా శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement