Monday, April 29, 2024

నేటితో సినిమా టికెట్ల వివాదానికి తెర‌ప‌డుతుంద‌ని భావిస్తున్నా – అల్లు అర‌వింద్

హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్న నిర్మాత అల్లు అర‌వింద్ ను మీడియా చుట్టుముట్టింది.దాంతో తాను వెళ్తున్నది ఏపీకి కాద‌ని, మ‌రో ప‌నిపై చెన్నైకి వెళ్తున్నాన‌ని అల్లు అర‌వింద్ చెప్పారు. ‘నేటితో సినిమా టికెట్ల వివాదానికి తెర‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాను. అంద‌రికీ మంచి జ‌రుగుతుంద‌ని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్తున్నారు.. క‌నుక నేను వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు’ అని అల్లు అర‌వింద్ చెప్పారు. నేడు టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ తో చ‌ర్చించ‌నున్నారు సినీ ప్ర‌ముఖులు. కాగా ఈ మీటింగ్ కి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ,నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు ఏపీకి వెళ్తున్న‌ట్లు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement