Thursday, April 25, 2024

ట్రాఫిక్ ఆంక్ష‌ల‌పై సీఎం సీరియ‌స్ : విచార‌ణ‌కు ఆదేశించిన జ‌గ‌న్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ‌వారం విశాఖ పర్యటన సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలను విధించడంపై జగన్ మండిపడ్డారు. నిన్న విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు జగన్ వెళ్లారు. అయితే శారదాపీఠంలో జగన్ రెండున్నర గంటల పాటు ఉంటే విశాఖలో దాదాపు ఆరు గంటల పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో జగన్ స్పందించారు. డీజీపీని విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని జగన్ డీజీపీని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇలాంటి ఆంక్షలు పెట్టడమేంటని జగన్ అధికారులను నిలదీశారు. ఈ ఘటనపై డీజీపీని విచారణకు ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement