Monday, May 6, 2024

మ‌ద‌న‌ప‌ల్లిలో ఏడు – కుప్పంలో నాలుగు సినిమా థియేట‌ర్ల మూసివేత‌

ఏపీలో సినిమా థియేట‌ర్లు, టిక్కెట్స్ పై ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. ప‌లు ర‌కాల పేర్త‌లో అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. ఈ మేర‌కు ప‌లు థియేట‌ర్స్ ని సీజ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా సినిమా థియేటర్లపై అధికారుల ఉక్కు పాదం మోపారు. ఈ నేపథ్యం లో మదనపల్లి లో ఏడు సినిమా థియేటర్లు, కుప్పంలో నాలుగు సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్లను మూసివేయిస్తున్నారు రెవెన్యూ అధికారులు.. దీంతో థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై ఆందోళనకు దిగుతున్నారు ఎగ్జిబిటర్లు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యం లో నేడు విజయవాడలో అత్యవసర సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు ఎగ్జిబిటర్లు. బీసీ సెంటర్లలో ప్రస్తుత టికెట్ ధరలతో థియేటర్లను నడపలేమని య‌జ‌మానులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement