Tuesday, April 30, 2024

TS | రేపు చెన్నై వెళ్ల‌నున్న ఎమ్మెల్సీ క‌విత‌.. ‘ద సదరన్​ రైసింగ్​ సమ్మిట్​’కి హాజరు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు (గురువారం) చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్‌వ‌ర్క్‌ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్‌’లో కవిత పాల్గొననున్నారు. ఈ స‌మ్మిట్‌లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై గురువారం రాత్రి ప్రారంభ‌మ‌య్యే చర్చా వేదికలో క‌విత పాల్గొని అభిప్రాయాలను తెలియజేయనున్నట్టు సమాచారం. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నమలై కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement