Tuesday, April 30, 2024

ప‌బ్లిక్ మీటింగ్ కి హెల్మెట్ ధ‌రించి వ‌చ్చిన.. ఎమ్మెల్యే

ప‌బ్లిక్ మీటింగ్ కి క్రికెట్ హెల్మెట్ ధ‌రించి వ‌చ్చారు ఛత్తీస్‌ఘ‌డ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అజ‌య్ చంద్ర‌కార్ . ఇటీవ‌ల సుపేలాలో జ‌రిగిన మీటింగ్‌లో ఆయ‌న‌పై రాళ్లు రువ్వారు. ఆ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా మ‌రో మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అజ‌య్ త‌న త‌ల‌కు హెల్మెట్ ధ‌రించారు. హెల్మెట్ పెట్టుకున్న ఎమ్మెల్యేను చూసిన జ‌నం షాక‌య్యారు. ఆ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. సుపేలా మీటింగ్‌లో రాళ్లు రువ్వార‌ని, కానీ రాళ్లు రువ్వేవాళ్లు ఛత్తీస్‌ఘ‌డ్ ప్ర‌జ‌లపై రువ్వుతున్న విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్లు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement