Tuesday, May 14, 2024

విమానాలు సిద్ధం చేయండి – వారి ఖ‌ర్చును మేం భ‌రిస్తాం – మంత్రి కేటీఆర్

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థుల పరిస్థితిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. విద్యార్థుల కోసం కేంద్రం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ఖర్చులను భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా మరోవైపు రష్యా సేనలను ఉక్రెయిన్‌ సైన్యం శక్తిమేరకు ప్రతిఘటిస్తుంది. తమ దాడుల్లో 450 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement