Thursday, May 16, 2024

మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళి

ఏపీ మంత్రి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ లోని గౌత‌మ్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఆయన భౌతికకాయానికి కేటీఆర్ నివాళుల‌ర్పించి, పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు. అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గౌత‌మ్ రెడ్డితో త‌న‌కు 12 ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌న్నారు. ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న నాయ‌కుడు గౌత‌మ్ రెడ్డి అని అన్నారు. కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement