Monday, April 29, 2024

గౌతంరెడ్డికి చంద్రబాబు నివాళి

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఈరోజు ఉద‌యం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయ‌న పార్థివ దేహాన్ని అభిమానులు, నేత‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు గౌత‌మ్ రెడ్డి భౌతిక‌కాయానికి నివాళులర్పించారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి త‌న‌ను కలచి వేసింద‌ని, ఎంతో భవిష్యత్‌ ఉన్న మేకపాటి మృతి బాధాకరమని చెప్పారు. త‌క్కువ కాలంలో స‌మ‌ర్థుడిగా పేరుతెచ్చుకున్నార‌న్నారు. హుందాగా రాజ‌కీయం చేశార‌న్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement