Saturday, April 27, 2024

కేసీఆర్ బదులుగా చంద్రబాబు.. నోరు జారిన మంత్రి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత టీఆర్ఎస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా చంద్రబాబును విమర్శించమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ నోరు జారారు. తమ పార్టీ అధినాయకుడి పేరు స్థానంలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తున్నారు. 

శనివారం కరీంనగర్ రురల్ మండలం ఇరుకుళ్ల గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల.. పెన్షన్ల గురించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. చివరలో ‘’ఇంతమంచి పథకాలు ఇచ్చిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా వద్దా.. కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా వద్దా’’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. అయితే వెంటనే తను చేసిన తప్పును సరిదిద్దుకుని కేసీఆర్ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, మంత్రి గంగుల గతంలో టీడీపీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో గంగుల ఇంకా మర్చిపోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

YouTube video

ఇది కూడా చదవండి: వైఎస్‌ వారసులకి తెలంగాణలో స్థానంలేదు: షర్మిలకు హరీష్‌ రావు కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement