Sunday, May 5, 2024

ముగిసిన విపక్షాల భేటీ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం

ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్ష పార్టీల నేతలు ఈ సమావేశంలో చర్చించారు. శరద్ పవార్ పేరును ప్రతిపాదించగా… ఆయన నిరాకరించారు. అయితే లెఫ్ట్ పార్టీలు మాత్రం మహాత్మాగాంధీ మనవడు గోపాలక్రిష్ణ గాంధీ పేరును సూచించాయి. మెజారిటీ పార్టీలు శరద్ పవార్ వైపు మొగ్గుచూపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement