Tuesday, April 30, 2024

Warangal : నిద్రమాత్రలు వేసుకొని మెడికో ఆత్మహత్యాయత్నం

తెలంగాణ రాష్ట్రం వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని పీజీ విద్యార్థిని లాస్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మైగ్రేన్ తో బాధపడుతున్న పీజీ విద్యార్థిని లాస్య నిన్న రాత్రి 8ఎం లో విధులు నిర్వహించి తలనొప్పి ఎక్కువగా ఉండడంతో నిద్రమాత్రలు వేసుకుంది.

దీంతో లాస్య స్పృహ కోల్పోయింది. కాకతీయ వైద్య కళాశాలలో పీజీ ఆర్థోపెటిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్య స్వస్థలం హైదరాబాద్. ఎంజిఎంలో RICU విభాగంలో ఎంజిఎం వైద్యులు చికిత్స అందిస్తు‌న్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే ప్రీతి ఘటన మరవక ముందే లాస్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో విద్యార్థుల్లో కలవరం మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement