Monday, May 6, 2024

సంగెం సుధీర్ కుమార్ ప్రతిభామూర్తుల పురస్కారం…

ఇచ్చోడ24 ప్రభాన్యూస్….. ఇచ్చోడ మండలంలోని అడగామా కె ఈ గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ 2023 ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు భాష సాంస్కృతిక శాఖ, సత్య సంగీత ఇంటర్నేషనల్ మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మానవతా మూర్తులకు ఈ అవార్డులను ప్రధానం ఇస్తున్నారు.

ఈ సంవత్సరానికి గాను సంగం సుధీర్ కుమార్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును అందజేయ నున్నారు. జులై 1 రాష్ట్ర రాజధానిలోని త్యాగరాజ గాన సభ ప్రాంగణం కార్యక్రమంలో అవార్డును స్వీకరించనున్నట్లు సుధీర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవి రమణాచారి తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర సలహా సలహాదారు, సముద్రాల వేణుగోపాల చారి మాజీ కేంద్ర మంత్రివర్యులు, అనిల్ కురుమచలం తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఓంకార్ , సప్త సంగీత ఇంటర్నేషనల్ అధ్యక్షులు, తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈకార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.. అవార్డును స్వీకరించనున్న సంఘం సుధీర్ కుమార్ ను పలువురు అభినందించారు….

Advertisement

తాజా వార్తలు

Advertisement