Monday, April 29, 2024

నా టీ షర్ట్ ని చూసిన మీడియాకి.. పేద రైతులు.. చిరిగిన దుస్తులు కనపడలేదా.. రాహుల్ గాంధీ

మీడియా తన టీ షర్ట్ ని మాత్రమే గమనించిందని..తన వెంట నడిచే పేద రైతులు..కూలీల చిరిగిన దుస్తుల గురించి మాత్రం అడగలేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. తాను భారత్ జోడో యాత్రలో టీ-షర్టులు ధరించి నడుస్తున్నా. యాత్రలో చాలా మంది పేద రైతులు, కూలీల పిల్లలు చిరిగిన బట్టలు ధరించి నాతో పాటు నడుస్తున్నారు. చలికాలంలో వాళ్లు స్వెటర్‌, జాకెట్‌ లేకుండా ఎందుకు నడుస్తున్నారని మాత్రం మీడియా అడగదు అని రాహుల్ పేర్నొనారు. రాహుల్ గాంధీ చలిగాలులతో దెబ్బతిన్న ఢిల్లీలోని కార్యక్రమాలతో సహా చాలా బహిరంగ కార్యక్రమాలకు సాధారణ పోలో టీ-షర్ట్ ధరించి వార్తల్లో నిలిచారు. దీని గురించి ఓ విలేఖరి ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు నచ్చినన్ని రోజులు టీ షర్టే ధరిస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement