Friday, April 19, 2024

Breaking: APని టెర్రరిస్ట్ స్టేట్ గా మారుస్తున్న జగన్.. చంద్రబాబు

రాష్ట్రాన్ని జగన్ టెర్రరిస్ట్ స్టేట్ గా మారుస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… ఒక వ్యక్తి అరాచక శక్తిగా తయారయ్యాడన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్, షర్మిల, విజయమ్మ పాదయాత్రలు చేశారన్నారు. వాళ్లకు పోలీసులు పూర్తిగా సహకరించారన్నారు.

తాను సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు సహకరించారు కాబట్టే జగన్ పాదయాత్ర పూర్తి చేశాడన్నారు. జీవో నెం.1 ను చూపి తన యాత్రను అడ్డుకుంటున్నారన్నారు. తన నియోజకవర్గంలో తనను పర్యటించనివ్వడం లేదని అన్నారు. హత్యాయత్నం కేసులు పెట్టి కార్యకర్తనలు వేధిస్తున్నారన్నారు. అన్నీ ఉన్నా ప్రచార రథాన్ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిలో భయం, పిరికితనం పెరిగాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement