Thursday, May 9, 2024

ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకుంది.. ఊహించినట్టు లైఫ్ లేక‌పోవ‌డంతో..

ఇంట్లో వాళ్ల‌ను కాదనుకుంది.. త‌న‌కు న‌చ్చిన వాడినే పెళ్లి చేసుకుంది.. కానీ, ఆ త‌ర్వాత ఆమె లైఫ్ త‌ను ఊహించుకున్నంత హ్యాపీగా సాగ‌లేదు. ఓ నర్సు లైఫ్‌లో ఆ తర్వాత ఊహించని పరిణామాలు తట్టుకోలేకుండా చేశాయి. చివరకు తన కూతురితో పాటు ఆమె ఈ భూమిపైనే లేకుండా పోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

తమిళనాడులోని విల్లుపురం జిల్లా మనలూరుపేట్‌లోని మారియమ్మన్ కోవిల్ స్ట్రీట్‌కు చెందిన వినోద్ కుమార్‌కు మనలూరుపేట్‌లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఆషా(26)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్లింది. అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఎదురైంది. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. న‌ర్సుగా ఓ పొజిష‌న్‌లో త‌ను ఉన్నా పెద్ద‌ల‌ను ఎదిరించే మ‌న‌స్థ‌త్వం కాక‌పోవ‌డంతో రెండేళ్ల క్రితం ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. త‌న‌కు న‌చ్చిన వాడితో పెళ్లి జరగడంతో ఆషా చాలా హ్యాపీగా ఫీల‌య్యింది. వినోద్ పెద్దగా చదువుకోలేదు. తిర్పూర్‌లో రోజువారీ పనులకు వెళ్తుండే వాడు. ఆషా హాస్పిట‌ల్‌లో నర్సుగా పని చేస్తుండేది.

కొన్నాళ్లకు వీరికి ఓ పాప పుట్టింది. పండంటి పాప పుట్టిందని సంతోఫ‌ పడినంత సేపట్లోనే చిన్నారి హెల్త్‌ ఆషా జీవితంలో క‌ల‌వ‌రానికి గురిచేసింది. పాప తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. తాను పని చేసే హాస్పిట‌ల్‌లోనే వైద్యం చేయించింది. ఇంత జరుగుతున్నా భర్త పట్టించుకోవడం లేదు. పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పినా కూతుర్ని చూసేందురు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందింది.

ఓ రోజు ఆమె ఉంటున్న ఇంటి తలుపులు ఓపెన్ చేయ‌కుండా ఉండ‌డంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి వెళ్లారు. ఒక రూమ్ లో పాప శవం, మ‌రో గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో ఆషా కనిపిచింది. అనారోగ్యంతో పాప చనిపోయిందని, కన్నబిడ్డ మృతిని తట్టుకోలేక ఆషా కూడా డిప్రెషన్‌లో సూసైడ్ చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement