Sunday, May 5, 2024

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్‌ కమిషన్ మెంబ‌ర్ గా సింధు..

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్‌ కమిషన్‌ సభ్యురాలిగా సింధు ఎంపికైంది. బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్‌ కమిషన్‌ సోమవారం ఆరుగురు పేర్లును సభ్యులుగా ప్రకటించింది. ఆరుగురి సభ్యుల్లో సింధుకు కూడా చోటు దక్కింది. ఈ కమిషన్‌లో సభ్యులుగా వీరు 2021-2025వరకు కొనసాగనున్నారు.

ఐరిస్‌వాంగ్‌ (అమెరికా), రాబిన్‌ టాబెలింగ్‌ (నెదర్లాండ్స్‌), గ్రేసియా పోలి (ఇండోనేషియా), కిమ్‌ సోయోంగ్‌ (దక్షిణకొరియా), సింధు (భారత్‌), జెంగ్‌ సీ వీ (చైనా) సభ్యులుగా ఉంటారు. వీరిలోనే ఒకరు చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌గా నియమితులవుతారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement