Friday, May 17, 2024

పెళ్లంటే జోక్ కాదు.. అమీర్ ఖాన్‌‌పై మండిపడుతున్న నెటిజన్లు

బాలీవుడ్ మిస్టర్ పర్‌ ఫెక్ట్ అమీర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్ దంప‌తులు విడిపోతున్నారనే వార్త ఆయన అభిమానులకు షాక్ కు గురి చేసింది. శనివారం అమీర్ తన భార్య కిరణ్ రావ్‌ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. తమ 15 ఏళ్ల వివాహ బంధానికి తెర‌దించ‌బోతున్నామని ఈ ఇద్ద‌రూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భార్యాభ‌ర్త‌లుగా విడిపోయినా.. తాము ఒకే కుటుంబ‌మ‌ని, ఒక‌రికొక‌రం తోడుంటామ‌ని అమీర్ తెలిపాడు. ఇది విని ఫ్యాన్స్ బాధ‌ప‌డి ఉండొచ్చు అని, తమ మ‌ధ్య ఉన్న సంబంధంలో మార్పు వ‌చ్చిందని పేర్కొన్నారు. కాగా, 2005లో కిరణ్‌ రావ్ ను అమీర్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అంత‌కుముందు 16 ఏళ్ల పాటు అత‌డు రీనాద‌త్తాతో క‌లిసి ఉన్నాడు.

మరోవైపు మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌పై సోషల్ మీడియా మండిపడుతోంది. తమ విడాకుల గురించి ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. వీరిద్దరి విడాకులకు కారణం ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ అనే విషయాన్ని ట్రెండ్ చేశారు. ‘దంగల్’ సినిమాలో కూతురిగా నటించిన భామ ఆ తర్వాత వెంటనే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో అమీర్‌తో రొమాన్స్ చేయడం వెనుక కారణం ఇదేనని, వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ వరకు జంటగా కనిపించడం ఓకే కానీ ఆ తర్వాత కూడా ఎందుకు లవ్ బర్డ్స్‌లా తిరగాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 15 ఏళ్లకోసారి అమీర్ ఖాన్ డైవోర్స్ సెలబ్రేషన్ చేసుకుంటాడా ఏంటి? అని సెటైర్స్ వేస్తున్నారు.

https://twitter.com/SainikVeer/status/1411230951426826243
Advertisement

తాజా వార్తలు

Advertisement