Wednesday, May 8, 2024

జాతీయ జెండా రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య కుమారై క‌న్నుమూత‌-సంతాపం తెలిపిన ప‌లువురు ప్ర‌ముఖులు

ఘంట‌సాల సీతా మ‌హాల‌క్ష్మి క‌న్నుమూశారు. ఈమె జాతీయ జెండా రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య కుమారై.ఆమె మరణంపై తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ సంతాపాన్ని తెలిపారు. మే నెలలో శత వసంతాలు పూర్తి చేసుకున్న సీతామహాలక్ష్మిని కలిసి ఘనంగా సన్మానించామని.. ఆమెకు పాదనమస్కారం చేసుకునే అవకాశం కలగడం తమ అదృష్టంగా భావించామన్నారు. 100 సంవత్సరాల వయస్సులో కూడా ఏ మాత్రం చెరగని ఉత్సాహం, తరగని జ్ఞాపకశక్తితో విషయాలను ఆసక్తిగా పంచుకున్నారని తెలిపారు.

పింగళి వెంకయ్య మనవడు జీవీఎన్ నరసింహం ఆంగ్లం, తెలుగు భాషల్లో రాసిన ‘పింగళి వెంకయ్య జీవితచరిత్ర’ పుస్తకాలను ఆ వయస్సులో కూడా ఆమె తన స్వహస్తాలతో సందేశం రాసి మరీ సంతకం చేసి తమకు బహుమతులుగా ఇవ్వడం ఒక మధురానుభూతి అన్నారు. పింగళి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. సీతామహాలక్ష్మి ఆత్మకు భగవంతుడు సద్గతిని కలిగించాలని మండలి బుద్ధప్రసాద్, తోటకూర ప్రసాద్‌లో కోరారు. ఘంటసాల సీతామహాలక్ష్మి పల్నాడు జిల్లా మాచర్లలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతామహాలక్ష్మికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆమె మరణంతో పింగళి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement