Monday, May 6, 2024

స్వచ్ఛతతోనే ఆరోగ్యం.. హరితహారంలో మొక్కలు నాటండి : ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్ : స్వచ్ఛతతోనే ఆరోగ్యంగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దాసరి గ్రామంలోని వాడ వాడలా పర్యటించారు. ఈసందర్భంగా తడి, పొడి చెత్తను వేరు వేరుగా నిల్వ చేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. ప్రజలంతా స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.

పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉం టామన్నారు. అలాగే హరితహారం ద్వారా విరివిగా మొక్కలను నాటడంతోపాటు సంరక్షిస్తే పచ్చదనం పెంపొందించిన వారమవుతామన్నారు. తద్వారా రోజు రోజుకు దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యతను కూడా రక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే దాసరి హరితహారం ద్వారా మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారు రామ్మూర్తితోపాటు సర్పంచ్‌, ఎంపీటీసీతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement