Sunday, April 28, 2024

Breaking: ఖ‌మ్మంలో ఉన్మాది ఘాతుకం.. భార్య‌పై అనుమానంతో అరటిపండ్ల కత్తితో దాడి

భార్యపై అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డాడో ఉన్మాది. ఈ ఘటన ఖమ్మం నగరంలో ఇవ్వాల (బుధవారం) రాత్రి జరిగింది. రేవతి సెంటర్ కు చెందిన తేజవత్ సాయి ఉన్మాదిగా మారాడు. తన భార్య ప్రీతిపై అనుమానంతో అరటి పండ్లు కోసే కత్తితో విచక్షణ రహితంగా శరీరంపై ఎక్కడపడితే అక్కడ దాడి చేశాడు.

దీంతో తీవ్ర గాయాలైన బాధితురాలు ప్రీతిని స్థానిక ప్రజలు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఉన్మాది సాయి పరారీలో ఉన్నాడు. వీరికి రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సాయి అరటి పండ్లు అమ్మే వ్యాపారం చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ప్రీతి ఆరు నెలల గర్భిణి అని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement