Saturday, April 27, 2024

టీఆర్ఎస్ ఫ్లెక్సీల‌పై జ‌రిమానాలు.. మంత్రి త‌ల‌సానికి రూ.50 వేల ఫైన్‌

టీర్ఎస్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆ పార్టీ నేత‌లు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల‌పై జ‌రిమానాలు విధిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జ‌రిమానాలకు గురైన వారిలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్​ యాద‌వ్ కూడా ఉన్నారు. ఆయ‌న ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై అధికారులు రూ.50 వేల ఫైన్​ వేశారు. టీఆర్ఎస్ ప్లీన‌రీని పుర‌స్క‌రించుకుని ఆ పార్టీ నేత‌లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశార‌ని, వాటిని తొల‌గించాల‌ని మంగ‌ళ‌వార‌మే బీజేపీ నేత‌లు అధికారుల‌ను డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా బుధ‌వారం ఈ ఫ్లెక్సీల‌పై సోష‌ల్ మీడియాలో అధికారుల‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఫ్లెక్సీల‌పై అధికారులు జ‌రిమానాలు విధించారు. ఇందులో భాగంగా త‌ల‌సానికి రూ.50 వేలు ఫైన్ వేసిన అధికారులు… మైనంప‌ల్లి రోహిత్‌కు రూ.40 వేలు, దానం నాగేంద‌ర్‌కు రూ.5 వేలు, కాలేరు వెంక‌టేశ్ కు రూ.10 వేలు జ‌రిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement