Sunday, May 12, 2024

FLASH: మహళను రాళ్లతో కొట్టి హత్య

కర్నూలు జిల్లాఆస్పరి మండలంలోని ముత్తుకూరు గ్రామంలో దారుణం చోటు జరిగింది. లింగమ్మ అనే మహిళను బావ హనుమంతు దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు వెంటనే హనుమంతుని దగ్గర్లో ఉన్న ఆదోని ఆస్పత్రికి తరలించారు. అయితే, హనుమంతు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణం వివాహేతర సంబంధమేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement