Monday, May 13, 2024

బీజేపీ తీర్థం పుచ్చుకున్న మ‌హేశ్వ‌ర్ రెడ్డి

నిర్మల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఈరోజు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చీఫ్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement