Friday, April 26, 2024

స‌ర్కారు వారి పాట‌లో మ‌హేశ్ బాబు న‌ట‌న అద్భుతం – రాఘ‌వేంద్ర‌రావు

నేడు స‌ర్కారు వారి పాట చిత్రం రిలీజ్ అయి పాజిటీవ్ టాక్ ని తెచ్చుకుంటోంది. ఈ చిత్రంపై ..మ‌హేశ్ బాబు న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. కాగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు అదిరిపోయే విధంగా అద్భుతంగా న‌టించార‌ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు స‌ర్కారు వారి పాట చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు ఆయ‌న‌. స‌ర్కారు వారి పాట‌లో ఫంటాస్టిక్ కామెడీ టైమింగ్ ఉందంటూ కితాబిచ్చారు. చిత్ర‌యూనిట్ అంద‌రికి శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశారు రాఘ‌వేంద్ర‌రావు. ద‌ర్శ‌క‌దిగ్గ‌జం ఇలా ట్వీట్ చేయ‌డంతో సినిమాకు మ‌రింత ప‌బ్లిసిటీ యాడ్ అయిన‌ట్టైంది. ఇదిలా ఉంటే మ‌హేశ్ బాబు ఎలా న‌టించారో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేయ‌డం విశేషంగా మారింది..ఇక వెండితెర‌కి మ‌హేశ్ బాబుని హీరోగా ప‌రిచ‌యం చేసింది రాఘ‌వేంద్ర‌రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement