Thursday, April 25, 2024

‘ధోని’ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు ర‌వీంద్ర జ‌డేజాకు అప్ప‌గింత – ట్వీట్ చేసిన సీఎస్కే యాజ‌మాన్యం

చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు టీమిండియా మాజీ కెప్టెన్ ప్ర‌స్తుత చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని. ఈమేరకు కాసేపటి క్రితమే మహేంద్ర సింగ్ ధోనీ అధికారిక ప్రకటన చేశాడు. ఇక తన కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగిస్తూ.. ధోని తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “ధోని తన నాయకత్వ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకోవడానికి మహేంద్రసింగ్ ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్ కు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడంతో… ఈ ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రవీంద్ర జడేజా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ లేకపోవడం.. తీరని లోటు “అంటూ సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement